Asia Cup 2023: బంపరాఫర్.. పాకిస్తాన్ ఓడితే ఒక్కొక్కరికి 1,000 రూపాయలు!

Asia Cup 2023: బంపరాఫర్.. పాకిస్తాన్ ఓడితే ఒక్కొక్కరికి 1,000 రూపాయలు!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దాయాదుల(ఇండియా vs పాకిస్తాన్) పోరు మొదలైంది. పల్లెకెలే వేదికగా ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే, మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారు అన్న దానిపై జోరుగా పందాలు సాగుతున్నాయి. బయట ఇలాంటి బెట్టింగ్‌లు సాధారణమే అయినా.. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే బహుమతి రూపంలో డబ్బు చెల్లిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు యూజర్లు బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

పాక్ ఓడితే ఒక్కొక్కరికి 1,000 రూపాయలు

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడితే ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున 15 మందికి డబ్బులు చెల్లిస్తానని ఓ ట్విట్టర్ యూజర్ ప్రకటించాడు. "ఈరోజు పాకిస్తాన్ ఓడిపోతే.. తదుపరి గంటలో ఈ ట్వీట్‌ లైక్ చేసిన 15 మందికి రూ.1000 చొప్పున గూగుల్ పే ద్వారా చెల్లిస్తాను.. " అని గుర్ ప్రీత్ గ్యారీ వలియా(Gurpreet Garry Walia) అనే నెటిజెన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. పోటీపోటీగా నెటిజెన్స్ ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 7 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(11),  విరాట్ కోహ్లీ(4)లను షాహీన్ ఆఫ్రిది పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం శుభ్ మాన్ గిల్(1), శ్రేయాస్ అయ్యర్(1) క్రీజులో ఉన్నారు.