నిజంగానే భయపడ్డాడా..!: కోహ్లీని ట్రోల్ చేస్తున్న పాక్ అభిమానులు

నిజంగానే భయపడ్డాడా..!: కోహ్లీని ట్రోల్ చేస్తున్న పాక్ అభిమానులు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత ప్రమాదకర ఆటగాడో మనందరికీ తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఏదైనా క్రీజులో పాతుకుపోయే కోహ్లీ.. ఆ జట్టు బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తాడు. అలాంటి ఆటగాడిని పాక్ అభిమానులు.. భయపడ్డారని ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం.. అతనిచ్చిన ఒక్కగానొక్క రియాక్షన్.

ఆసియా కప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షాహీన్ ఆఫ్రిది పదునైన బంతులతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆరంభంలోనే రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(1)లను పెవిలియన్ చేర్చి.. టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. అయితే, షాహీన్ అఫ్రిది వేసిన ఒక బంతిని రోహిత్ సరిగ్గా అంచనా వేయలేకపోగా.. కోహ్లి ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కింగ్ భయపడ్డాడు..!

ఐదో ఓవర్ చివరి బంతిని షాహీన్ ఇన్-స్వింగింగ్ డెలివరీ సంధించాడు. దాన్ని రోహిత్ డిఫెన్స్‌ ఆడబోగా.. అది స్వింగ్ అయ్యి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ బంతిని చూసి కోహ్లీ.. ఇలా వేస్తున్నారేంట్రా బాబోయ్.. అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. దీన్ని పట్టుకొని పాక్ అభిమానులు మ్యాచ్ గెలిచినంత సంబరపడిపోతున్నారు. కింగ్ భయపడ్డాడు అన్నట్లు మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యారు.