
భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ.. కెరీర్ లో 76వ శతకం నమోదు చేశాడు. అయితే ఈ మ్యాచ్ విరాట్కి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
87 పరుగుల వ్యక్తిగత ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లీ 180 బంతుల్లో 10 ఫోర్లతో వంద మార్కును చేరుకున్నాడు. దాంతో 500వ మ్యాచ్లో వంద కొట్టిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (664), ధోనీ (538), రాహుల్ ద్రావిడ్ (509) వంటి ఆటగాళ్లు 500పైగా మ్యాచులు ఆడిన.. వారెవరూ 500వ మ్యాచ్లో సెంచరీ చేయలేకపోయారు. ఇక టెస్టు క్రికెట్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ కాగా.. ఈ ఏడాదిలో రెండోది. టెస్టుల్లో అత్యధిక సెంచరీల జాబితాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్మాన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు.
Asians with most centuries overseas:
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2023
Sachin Tendulkar - 29.
Virat Kohli - 28*.
- Two GOATs of the game! pic.twitter.com/7XcHst4zOX
50 on 500th ?
— FanCode (@FanCode) July 20, 2023
.
.#ViratKohli? #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/0EuVH3Ctsb
మరోవైపు కోహ్లీ సెంచరీకి తోడు.. రవీంద్ర జడేజా(50) కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 91 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది.