భారత ఆటగాళ్లకు దెబ్బ మీద దెబ్బ.. ట్రోఫీ లేదు.. డబ్బులు రాలే

భారత ఆటగాళ్లకు దెబ్బ మీద దెబ్బ.. ట్రోఫీ లేదు.. డబ్బులు రాలే

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓటమితో బాధపడుతున్న భారత ఆటగాళ్లకు ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు మ్యాచ్‌ ఫీజులో 100శాతం కోత విధించింది. అలాగే టైటిల్‌ గెలిచిన ఆస్ట్రేలియకూ జరిమానా తప్పలేదు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆసీస్‌ జట్టుకు మ్యాచ్‌ ఫీజులో 80శాతం కోత విధించింది. నిర్ణీత సమయంలో టీమిండియా 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్‌ చేశాయని ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. 

అంపైర్‌ను ఉద్దేశిస్తూ గిల్ ట్వీట్.. ఐసీసీ చర్యలు 

భారత బ్యాటింగ్ రెడీనా ఇన్నింగ్స్ లో గిల్‌ వివాదస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై గిల్.. 'థర్డ్ అంపైర్‌కు కళ్లు సరిగ్గా కనిపించలేదా? భూతద్దాలు పెట్టుకొని చూడొచ్చుగా..' అని అర్థం వచ్చేలా సోషల్ మీడియా వేదికగా ఎమోజీలు పోస్ట్‌ చేశాడు. అందుకుగానూ ఐసీసీ గిల్‌కు అదనపు జరిమానా విధించింది. అంపైర్‌ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. మొత్తంగా గిల్‌కు ఈ మ్యాచ్‌లో 115శాతం జరిమానా పడింది. ఆర్టికల్‌ 2.7 అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగిన ఘటనపై బహిరంగ విమర్శలు, అనుచిత వ్యాఖ్యల నిబంధన కింద ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది.

కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.