
పురుషుల జూనియర్ ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో నిలిచిన భారత్ తన చివరి పూల్-ఎ మ్యాచ్లో 17-0 తేడాతో థాయ్లాండ్ జట్టును చిత్తు చేసింది.. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
ఈ మ్యాచ్లో భారత ఆటగాడు అంగద్ బీర్ సింగ్ అత్యధికంగా నాలుగు గోల్స్ సాధించగా, కెప్టెన్ ఉత్తమ్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. కాగా, ఈ టోర్నీలో భారత్.. పాకిస్థాన్, జపాన్, చైనీస్ తైపీ, థాయ్లాండ్ జట్లతో కలిపి పూల్-ఏలో తలపడింది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించగా, పాకిస్థాన్తో జరిగిన మ్యాచును 1-1 గోల్స్తో డ్రా చేసుకుంది. ఈ విజయంతో భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఒకవేళ పాకిస్థాన్ తమ చివరి గ్రూప్ మ్యాచ్లో జపాన్ను 14 గోల్స్ కంటే ఎక్కువ తేడాతో ఓడించినట్లయితే పూల్ -ఏలో భారత్ రెండో స్థానానికి పడిపోనుంది.
2021లో జరగాల్సిన 'మెన్స్ జూనియర్ ఆసియా కప్' టోర్నీ కరోనా కారణంగా రద్దవగా.. 2015లో భారత జట్టు ఛాంపియన్గా అవతరించింది.