జూనియర్ హాకీ ఆసియా కప్‌.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌

జూనియర్ హాకీ ఆసియా కప్‌.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌

పురుషుల జూనియర్ ఆసియా కప్‌ టోర్నీలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో నిలిచిన భారత్ తన చివరి పూల్-ఎ మ్యాచ్‌లో 17-0 తేడాతో థాయ్‌లాండ్‌ జట్టును చిత్తు చేసింది.. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. 

ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు అంగద్‌ బీర్‌ సింగ్ అత్యధికంగా నాలుగు గోల్స్‌ సాధించగా, కెప్టెన్‌ ఉత్తమ్‌ సింగ్‌ రెండు గోల్స్‌ చేశాడు. కాగా, ఈ టోర్నీలో భారత్.. పాకిస్థాన్‌, జపాన్‌, చైనీస్‌ తైపీ, థాయ్‌లాండ్‌ జట్లతో కలిపి పూల్‌-ఏలో తలపడింది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్‌ తైపీ, జపాన్‌ జట్లను భారత్‌ ఓడించగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచును 1-1 గోల్స్‌తో డ్రా చేసుకుంది. ఈ విజయంతో భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఒకవేళ పాకిస్థాన్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో జపాన్‌ను 14 గోల్స్ కంటే ఎక్కువ తేడాతో ఓడించినట్లయితే పూల్ -ఏలో భారత్‌ రెండో స్థానానికి పడిపోనుంది. 

2021లో జరగాల్సిన 'మెన్స్‌ జూనియర్‌ ఆసియా కప్‌' టోర్నీ కరోనా కారణంగా రద్దవగా.. 2015లో భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది.