
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాఈ రోజు భారత్ కు రానున్నారు. 14వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఈ రోజు ప్రారంభంకానుంది. ఇవాళ, రేపు జరిగే ఈ సమావేశలో పాల్గొనలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాను పీఎం నరేంద్ర మోడీ ఆహ్వానించారు. కాగా రెండు దేశాల ప్రధానులు సమావేశమడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.