దేశంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. చాలారోజుల తర్వాత 60వేలకు దిగొచ్చాయి కరోనా పాజిటివ్ కేసులు. కొత్తగా 67వేల 597 మందికి వైరస్ సోకింది. లక్షా 80వేల 456 మంది కోలుకోగా.. 11వందల 88 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 9లక్షల 94వేల 891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 5.02 శాతానికి పడిపోయింది. దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ 170 కోట్లు దాటిందని తెలిపింది కేంద్ర వైద్యారోగ్యశాఖ.
మరిన్ని వార్తల కోసం