భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2 లక్షల 71వేల 202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 324 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇప్పటివరకు 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి లక్షా 38వేల 331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో 15 లక్షల 50వేల 377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7743కు చేరింది.
మరోవైపు కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇప్పటికే తమిళనాడు, జమ్ముకాశ్మీర్ లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలంతా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
India reports 2,71,202 COVID cases (2,369 more than yesterday), 314 deaths, and 1,38,331 recoveries in the last 24 hours.
— ANI (@ANI) January 16, 2022
Active case: 15,50,377
Daily positivity rate: 16.28%)
Confirmed cases of Omicron: 7,743 pic.twitter.com/NhnMY247oV