
దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని భారతదేశం.. పాలస్తీనాకు తీసుకువెళ్ళే వైమానిక దళ విమానాన్ని పంపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, IAF విమానం IAF C-17 ఈజిప్ట్లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది. అత్యవసరమైన ప్రాణాలను రక్షించే మందులు, సర్జికల్ వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీలు, ఇతర అవసరమైన వస్తువులతో పాటు నీటి శుద్దీకరణ మాత్రలు ఇందులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
"పాలస్తీనా ప్రజలకు భారతదేశం మానవతా సహాయం పంపుతుంది. పాలస్తీనా ప్రజల కోసం దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం, 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని తీసుకుని IAF C-17 విమానం ఈజిప్ట్లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది" అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చీ X పోస్ట్లో తెలిపారు.
"ఈ మెటీరియల్లో అవసరమైన ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీలు, ఇతర అవసరమైన వస్తువులతో పాటు వాటర్ ఫ్యూరిఫికేషన్ మాత్రలు కూడా ఉన్నాయి" అని ఈ పోస్టు తెలిపింది.
Also Read :- 3 చైనా కంపెనీలపై అమెరికా బ్యాన్
ఆసుపత్రి దాడిని ఖండించిన ప్రధాని మోదీ
అంతకుముందు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ దారుణ ఘటనపై తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశం దీర్ఘకాల సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళనలను లేవనెత్తారు. ఈ క్రమంలోనే పాలస్తీనా ప్రజలకు భారతదేశం మానవతా సహాయం పంపడం కొనసాగిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
?? sends Humanitarian aid to the people of ??!
— Arindam Bagchi (@MEAIndia) October 22, 2023
An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph