
మీర్పూర్: బంగ్లాదేశ్ టూర్లో ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన ఇండియా విమెన్స్ టీమ్ ఇప్పుడు వన్డేలపై గురి పెట్టింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో బంగ్లాతో తలపడనుంది. హర్మన్ప్రీత్ కెప్టెన్సీలోని టీమ్ టీ20 సిరీస్ను 2-–1తో గెలిచినప్పటికీ బ్యాటింగ్లో తీవ్రంగా నిరాశ పరిచింది. పైగా చివరి మ్యాచ్లో ఓడింది. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో అయినా బ్యాటింగ్లో సత్తా చాటాలని చూస్తోంది.