INDvsENG: భారత్ 477 ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే.?

INDvsENG: భారత్ 477 ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే.?

ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 477 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ కు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 259 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు జైశ్వాల్ 57, రోహిత్ శర్మ 103, శుభ్ మన్ గిల్ 110, దేవదత్, పడిక్కల్ 65, సర్ఫరాజ్ ఖాన్ 56, కుల్దీప్ యాదవ్ 30, బుమ్రా 20 పరుగులు చేశారు.

ఓవర్ నైట్ స్కోర్  473 పరుగులతో  మూడో రోజు ఆట ప్రారంభించిన ఇండియా మరో నాలుగు పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.  ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5,  జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్లీలకు చెరో రెండు వికెట్లు, బెన్ స్టోక్ కు ఒక  వికెట్ పడ్డాయి. అంతకుముందు ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 218 పరుగులు చేసింది. జాక్ క్రాలె 79, డక్కెట్ 27, రూట్ 26, బెయిర్ స్టో 29, ఫోక్స్ 24 పరుగులు మినహా మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు.