భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 234/7 డిక్లేర్ 

భారత్  సెకండ్ ఇన్నింగ్స్ 234/7 డిక్లేర్ 

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్టు 2వ ఇన్నింగ్స్ లో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్  ఇచ్చింది. 2వ ఇన్నింగ్స్ 234/7 వద్ద భారత్ డిక్లేర్ ప్రకటించడంతో..తొలి ఇన్నింగ్స్ కలిపి ఇండియా 283 పరుగులకు చేరింది. భారత బ్యాట్స్ మన్లలో శ్రేయాస్ అయ్యర్(65),సాహా(61), అక్షర్ పటేల్(28), రాణించారు. కివీస్ బౌలర్లలో సౌథీ, జేమిసన్ చెరో 3 వికెట్లు, అజాజ్ కు 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో కివీస్ గెలవాలంటే 284 రన్స్ చేయాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది.ఐదో రోజు ఫలితం తేలనుంది.