
బీజింగ్: అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్లోని వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. అతడిని ఇండియన్ కోస్ట్గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ వెల్లడించింది. చైనాకు చెందిన షిప్ తీరానికి 200 కి.మీలో ఉన్న టైంలో అందులో పనిచేస్తున్న వీగ్యాంగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
కార్డియాక్ అరెస్ట్గా గుర్తించి అక్కడున్న వారు అధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న కోస్ట్గార్డ్ హెలికాప్టర్తో రంగంలోకి దిగింది. చిమ్మ చీకటి, ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలు చేపట్టింది. ఎయిర్లిఫ్ట్ సహాయంతో అతడిని హెలికాప్టర్లోకి ఎక్కించి అక్కడినుంచి ఆస్పత్రికి తరలించింది.