గత పదేళ్లలో ఎంతో సాధించాం : నిర్మలా సీతారామన్​

గత పదేళ్లలో ఎంతో సాధించాం : నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ: గడచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో దూసుకెళ్లిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం చెప్పారు. భారతదేశ ప్రజలు భవిష్యత్తు కోసం ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో చర్యలను తీసుకుందని అన్నారు. నిర్మాణాత్మక మార్పులు, ప్రజానుకూల కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు ఆర్థిక వ్యవస్థకు ఎంతో శక్తిని అందించాయని ఆర్థిక మంత్రి చెప్పారు.

2020–-21లో జీడీపీ  5.8 శాతం తగ్గిన తర్వాత, 2021–-22లో ఆర్థిక వ్యవస్థ 9.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తన తాజా నెలవారీ ఆర్థిక సమీక్షలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత  3.7 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో వచ్చే మూడేళ్లలో ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా అవతరించనుందని పేర్కొంది. వచ్చే ఆరు నుంచి ఏడేళ్లలో 2030 నాటికి 7 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదగగలదని కూడా పేర్కొంది.

డిసెంబరులో, ఆర్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. దేశీయ డిమాండ్,  తయారీ రంగంలో బలంగా ఉండటమే ఇందుకు కారణం. 2023–-24,  2024–-25 సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి 6.5 % వద్ద పటిష్టంగా ఉంటుందని ఐఎంఎఫ్​ పేర్కొంది.