ఐపీఓలతో లాభాల పంట

ఐపీఓలతో లాభాల పంట

న్యూఢిల్లీ: ఐపీఓ  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2023 లో దూసుకుపోయింది. బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 20 శాతం మేర పెరిగాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.82 లక్షల కోట్లు ఎగసింది. మార్కెట్ ఫుల్ జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో ఐపీఓకి వచ్చిన చాలా కంపెనీలు ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు తెచ్చి పెట్టాయి. 2023 లో వచ్చిన 59 మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్ ఐపీఓల్లో 54  ఇన్వెస్టర్లకు సగటున 45 శాతం రిటర్న్ ఇచ్చాయి. ఈ  59 ఐపీఓలు రూ.54 వేల కోట్లు సేకరించాయి.  2023 లో  లిస్టింగ్ అయిన కంపెనీలు మొదటి రోజే ఇన్వెస్టర్లకు సగటున 26 శాతం రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాయి. కేవలం నాలుగు మెయిన్ బోర్డ్ ఐపీఓలు మాత్రమే ప్రస్తుతం  ఇష్యూ ధర కంటే తక్కువకు ట్రేడవుతున్నాయి. 23 కంపెనీలు  లిస్టింగ్ రోజు నుంచి 50 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. 

తొమ్మిది కంపెనీలయితే ఇష్యూ ధర కంటే రెండు రెట్లు ఎక్కువ లాభం ఇచ్చాయి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఈఏ)  షేర్లు ఏకంగా 221 శాతం లాభపడ్డాయి. సైయెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం (154 శాతం), నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (141 శాతం),  టాటా టెక్నాలజీస్ (136 శాతం), రియల్టీ కంపెనీ సిగ్నీచర్ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (128 శాతం)  షేర్లు కూడా భారీగా పెరిగాయి. ఐపీఓల పరంగా రెండో బెస్ట్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియా నిలిచింది. చైనా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 240 ఐపీఓలు 60 బిలియన్ డాలర్లు సేకరించాయి.  

ఎకానమీ ఫండమెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండడం, రాజకీయ స్థిరత్వం, కార్పొరేట్ కంపెనీల రిజల్ట్స్ మెరుగ్గా ఉండడం, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తామని ప్రకటించడం వంటి కారణాలతో 2023 లో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దూసుకుపోయాయి. ఈ ఏడాదిలో 2.7 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.1.7 లక్షల కోట్లు మన మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. 59 మెయిన్ బోర్డ్ ఐపీఓలతో పాటు 182 ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ ఐపీఓలు కూడా ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి.