
పెయెంగ్చాంగ్ (సౌత్ కొరియా): ఆసియా చాంపియన్షిప్లో ఇండియా మెన్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 0–3తో చైనీస్తైపీ చేతిలో ఓడటంతో మూడో స్థానానికే పరిమితమైంది. తొలి మ్యాచ్లో శరత్ కమల్ 6–11, 6–11, 9–11, చుయాంగ్ చిచ్ యువాన్ చేతిలో, సత్యన్ 5–11, 6–11, 10–12తో వరల్డ్ ఏడో ర్యాంకర్ లిన్ యున్ జియు చేతిలో ఓడారు. దీంతో ఇండియా 0–2తో వెనకబడింది. చివరిదైన మూడో మ్యాచ్లోనూ హర్మీత్ దేశాయ్ 11–6, 11–7, 7–11, 11–9తో కావో చెంగ్ జుయ్ చేతిలో పరాజయం చవిచూశాడు.