వయనాడ్‌కు మళ్లీ భారీ వర్ష సూచన ఆరెంజ్అలర్ట్ జారీ చేసిన ఐఎండి

వయనాడ్‌కు మళ్లీ భారీ వర్ష సూచన ఆరెంజ్అలర్ట్ జారీ చేసిన ఐఎండి

న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్​లో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) హెచ్చరించింది. బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం కన్నూర్, త్రిస్సూర్, ఎర్నాకులంలలో  ఒకటి నుంచి రెండుచోట్ల, గురువారం వయనాడ్, కోజికోడ్​లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండిఅంచనా వేసింది. లక్షద్వీప్​కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం అక్కడ అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో వయనాడ్​లో జులై 30న 230 మందికి పైగా మరణించారు.

మృతుల కుటుంబాలకు 6 లక్షలు: పినరయి

వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల నష్టపరిహారాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఇందులో రూ.4 లక్షలు రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి, మిగిలిన మొత్తాన్ని ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి నుంచి ఇస్తామని 
సీఎం పినరయి విజయన్ తెలిపారు.