
హూస్టన్: ఆంధ్రప్రదేశ్కు చెందిన శిరీష బండ్ల ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ చేపట్టిన స్పేస్ టూర్లో భాగంగా స్పేస్లోకి వెళ్లనున్నారు. అమెరికా న్యూ మెక్సికో స్టేట్లోని ‘ట్రూత్ ఆర్ కాన్ సీక్వెన్సెస్’ సిటీ సమీపంలో ఉన్న స్పేస్ పోర్టు నుంచి ‘యూనిటీ 22’ మిషన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ షురువైంది. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ అధినేత రిచర్డ్ బ్రాన్సన్తో పాటు శిరీష, మరో నలుగురు ఈ టూర్లో స్పేస్కు వెళ్లి రానున్నారు. మన టైం ప్రకారం, ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు స్పేస్ టూర్ మొదలుకానుంది. ఏపీలోని గుంటూరులో జన్మించిన శిరీష(34) అమెరికాలోని హూస్టన్లో పెరిగారు. ఈ మిషన్ సక్సెస్ అయితే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత స్పేస్లోకి వెళ్లిన మూడో ఇండియన్ ఆరిజిన్ మహిళగా రికార్డు సృష్టించనున్నారు.
90 నిమిషాల్లో స్పేస్ టూర్..
స్పేస్ టూర్లో భాగంగా మొదట కంపెనీకి చెందిన క్యారియర్ ప్లేన్.. ‘వీఎస్ఎస్ యూనిటీ’ స్పేస్ ప్లేన్ ను 50 వేల అడుగుల (15.24 కిలోమీటర్లు) ఎత్తులో విడిచిపెడుతుంది. అక్కడి నుంచి రాకెట్ సాయంతో స్పేస్ ప్లేన్ గంటకు 3,700 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్తుంది. స్పేస్ లోకి (సుమారు 100 కిలోమీటర్లు) వెళ్లగానే రాకెట్ ఇంజన్ స్విచ్ ఆఫ్అవుతుంది. స్పేస్ ప్లేన్ అక్కడ నాలుగు నిమిషాల పాటు విహరిస్తుంది. ఆ తర్వాత భూమికి తిరిగి వచ్చి స్పేస్ పోర్టులో ల్యాండ్ అవుతుంది. ఈ మొత్తం టూర్ అంతా 90 నిమిషాలలో ముగిసిపోతుంది. స్పేస్ ప్లేన్ లో ఉన్నోళ్లకు సబ్ ఆర్బిట్ లోకి వెళ్లగానే జీరో గ్రావిటీకి లోనై బరువు కోల్పోవడం, స్పేస్ నుంచి భూమిని చూసే అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ సొంతమవుతుంది. స్పేస్ ప్లేన్ లో ప్రతి క్షణం టూరిస్టుల ఎక్స్ పీరియెన్స్ ను హెచ్ డీ కెమెరాలు బంధిస్తాయి. ఈ టూర్ లో ఒక పైలట్, ఒక కో పైలట్ తో పాటు శిరీష, బ్రాన్సన్ మరో ఇద్దరు రీసెర్చర్ ఎక్స్ పీరియెన్స్ (ప్యాసింజర్లు)గా వెళ్తున్నారు. టూర్ లో శిరీషకు ‘ఆస్ట్రోనాట్ నెంబర్ 004’ను కేటాయించారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ స్పేస్ కు ప్లేన్ ను పంపడం ఇది 22వ సారి కానుంది. ఇప్పటివరకు మూడుసార్లు మానవ సహిత మిషన్ లు చేపట్టింది. పూర్తి స్థాయిలో ఒక పైలట్, ఒక కోపైలట్, నలుగురు ప్యాసింజర్లతో ప్రయాణించనుండటం ఇదే ఫస్ట్ టైం. దీని తర్వాత మరో రెండు ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులను స్పేస్ లోకి తీసుకెళ్లేందుకు కమర్షియల్ గా స్పేస్ టూర్ లు ప్రారంభం కానున్నాయి.