భారత బౌలర్ల జోరు..99 రన్స్కే పాక్ ఆలౌట్

భారత బౌలర్ల జోరు..99 రన్స్కే పాక్ ఆలౌట్

కామన్వెల్త్ గేమ్స్లో దాయాది పాకిస్థాన్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో  భారత మహిళా బౌలర్లు అదరగొట్టారు. వర్షం కారణంగా 18ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో భారత బౌలర్ల ధాటికి పాక్ 99 పరుగులకే ఆలౌట్ అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్...పరుగులేమి చేయకుండానే వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ ఇరామ్ జావెద్ ను మెఘనా సింగ్ పెవీలియన్ చేర్చింది. ఈ దశలో మరో ఓపెనర్ మునీబా అలీ, బిస్మా మరూఫ్ జట్టును ఆదుకున్నారు.

ముఖ్యంగా మునీబా 32 పరుగులు చేసి కొద్దిసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసింది. అయితే ఈ సమయంలో స్నేహ రానా జట్టుకు మరో వికెట్ను అందించింది. ప్రమాదకరంగా మారుతున్న మునీబాను ఔట్ చేసింది. ఆ తర్వాత పాక్ వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరకు 18 ఓవర్లలో పాకిస్థాన్ 99 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, స్నేమ రానా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. రేణుకా సింగ్, మేఘనా సింగ్, షఫాలీ శర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు.