
పెళ్లి చేసుకునేందుకు వెళ్లి, కనపడకుండా పోయిన యువతి
వాషింగ్టన్: అమెరికాలో భారత్కు చెందిన యువతి (24) కనబడకుండా పోయింది. తల్లిదండ్రులు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ కోసం అమెరికా వెళ్లి అదృశ్యం అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిమ్రాన్ అనే యువతి జూన్ 20న న్యూజెర్సీకి వచ్చింది. అదే నెల 26 నుంచి కనబడకుండా పోయింది. ఆమె జాడ తెలియకపోవడంతో గత బుధవారం అమెరికా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఫోన్ చూస్తూ ఎవరి కోసమో ఆమె ఎదురుచూస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఆమెకు అసలు వివాహం చేసుకునే ఉద్దేశమే లేదని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు తెలుసుకున్నారు. అమెరికాకు ఫ్రీగా వచ్చేందుకు పెళ్లిని ఒక సాకుగా ఆమె ఉపయోగించుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిమ్రాన్కు అమెరికాలో బంధువులు ఎవరూ లేరని వెల్లడించారు.