కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల

కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం నమోదైన కేసులతో పోల్చితే బుధవారం 3 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,61,386 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2,81,109 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 1733 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మరణాలతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,97,975 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 16,21,603 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రోజూవారీ కేసుల పాజిటివిటి రేటు 11.6 శాతం నుంచి 9.26 శాతానికి తగ్గింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,95,11,307 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. కాగా.. మంగళవారం నాటికి 167.29 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.

For More News..

24 రోజుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్