
ముంబై: ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కరోనా బారిన పడ్డాడు. దాంతో, విండీస్తో టీ20 సిరీస్కు అతను దూరం కానున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుంచి కోలుకొని బెంగళూరు ఎన్సీఏలో ప్రాక్టీస్ మొదలు పెట్టిన రాహుల్ పాజిటివ్గా తేలినట్టు బీసీసీఐ బాస్ గంగూలీ తెలిపాడు. కామన్వెల్త్ గేమ్స్కు ఎంపికైన విమెన్స్ టీమ్లో ఓ క్రికెటర్ కూడా కరోనా బారిన పడినట్టు బీసీసీఐ అపెక్స్ కమిటీ మీటింగ్లో వెల్లడించాడు. కానీ, ఆ ప్లేయర్ పేరు చెప్పలేదు. కాగా, రాహుల్ ఎన్సీఏలో లెవెల్3 సర్టిఫికేషన్ కోర్సుకు హాజరైన కోచ్లతో గురువారం జరిగిన సమావేశానికి హాజరై మాట్లాడాడు.