
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో మెన్స్ సింగిల్స్లో రెండు స్థానాలు మెరుగై ప్రపంచ ఏడో ర్యాంక్కు చేరుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ సైతం విమెన్స్ డబుల్స్లో రెండు ప్లేస్లు మెరుగై 15వ ర్యాంక్ అందుకుంది.
విమెన్స్ సింగిల్స్లో స్టార్ షట్లర్ పీవీ సింధు 12 నుంచి 11వ ప్లేస్కు చేరుకుంది. మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ 22, 23వ స్థానాల్లో నిలవగా.. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట రెండు ప్లేస్లు పడిపోయి ఏడో ర్యాంక్లో నిలిచింది..