వెస్టిండీస్ సిరీస్ : రోహిత్ శర్మనే కెప్టెన్.. పుజారా ఔట్

వెస్టిండీస్ సిరీస్ : రోహిత్ శర్మనే కెప్టెన్.. పుజారా ఔట్

వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా టీమిండియా తరపున ఆడే టెస్ట్, వన్డే జట్లను ప్రకటించింది బీసీసీఐ. జూన్ 23వ తేదీ ఈ మేరకు అధికారికంగా జట్టు సభ్యులతో లిస్ట్ రిలీజ్ చేసింది బీసీసీ. రెండు ఫార్మెట్లకు రోహిత్ శర్మ కెప్టెన్ నే కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో విఫలం అయిన పుజారాను పక్కనపెట్టారు సెలక్టర్లు. జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లను ఫస్ట్ టైం టైం టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. 

టీమిండియా ప్లేయర్స్ :

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కె.ఎస్.భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉద్కత్, నవదీప్ సైనీని వెస్టిండీస్ టూర్ లో ఆడే రెండు టెస్టు మ్యాచులకు ఎంపిక అయ్యారు.