స్వయం సహాయక సంఘాల ద్వారా..ఇందిరమ్మ ఇండ్లకు లోన్లు ఇవ్వండి

స్వయం సహాయక సంఘాల ద్వారా..ఇందిరమ్మ ఇండ్లకు లోన్లు ఇవ్వండి
  •  హౌసింగ్​ సెక్రటరీ వీపీ గౌతమ్

కొడంగల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కట్టుకోలేకపోతున్న వారికి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా లోన్​లు ఇవ్వాలని హౌసింగ్​సెక్రటరీ వీపీ గౌతమ్ సంబంధింత అధికారులను ఆదేశించారు. 

వికారాబాద్ జిల్లా బొంరాస్​పేట మండలం మెట్లకుంటలో సెకండ్​ఫేజ్​ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. ఇండ్లు మంజూరైనా నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల గురించి ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులు, కూలీలు, ఇసుక కొరత, ఎస్టిమేషన్​పెరగడం వల్ల ఇండ్ల నిర్మాణం చేపట్టలేదని ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సమస్యను వివరించారు. 

దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు లోన్​లు మంజూరు చేయాలని ఎంపీడీవో వెంకన్నగౌడ్​ను ఆదేశించారు. స్కీల్డ్​లేబర్లను వినియోగించడం ద్వారా వ్యయం తగ్గించుకోవచ్చని సూచించారు. ఇంటి నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్​హర్ష్​చౌదరి, లైబరీ చైర్మన్​రాజేశ్​రెడ్డి ఉన్నారు.