హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఇండోమ్యాక్’ ఎగ్జిబిషన్

హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఇండోమ్యాక్’ ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ఇండస్ట్రియల్ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ ‘ఇండోమ్యాక్​’ శుక్రవారం హైదరాబాద్​లోని హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమైంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, స్మార్ట్, ఎఫెక్టివ్, ఇంటెలిజెంట్ మెషినరీ, ఇండస్ట్రియల్ రోబోలు, ఇండస్ట్రియల్ సాఫ్ట్‌‌‌‌వేర్​పై ఇది ఫోకస్​ చేస్తుంది. ఈ మూడు రోజుల ఎక్స్‌‌‌‌పోలో 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. కార్యక్రమం ఆదివారం ముగుస్తుంది. దాదాపు 500లకుపైగా మెషీన్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దాదాపు 400 బ్రాండ్లు పాల్గొంటున్నాయి.

మైక్రో, స్మాల్​, మీడియా ఇండస్ట్రీస్​ (ఎంఎస్​ఎంఈ) ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ముత్తురామన్, తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి హైటెక్స్‌‌‌‌లో ఎగ్జిబిషన్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ముత్తురామన్ మాట్లాడుతూ ఎంఎస్​ఎంఈలు దేశీయ, ప్రపంచ మార్కెట్ల డిమాండ్‌‌‌‌లను తీర్చడానికి వివిధ రకాల ఉత్పత్తులను,  సేవలను అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయని అన్నారు. వ్యవసాయం తర్వాత ఎంఎస్​ఎంఈలే అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. ఉత్పత్తి కోసం కొత్త టెక్నాలజీలను వాడాలని రమాదేవి అన్నారు.

ఇంజినీరింగ్  యంత్రాలు, మెషీన్​ తయారీ పరిశ్రమలు దేశానికి వెన్నెముక అని కామెంట్​ చేశారు.  ఇండోమ్యాక్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌‌‌‌ను నిర్వహిస్తున్న ఇండోమ్యాక్ బిజినెస్ సొల్యూషన్స్ డైరెక్టర్లు సచిన్, సోమ, సుధీర్ భలే, మనీష్ సిన్హా సుమిత్ పర్వాల్ మాట్లాడుతూ ఇక్కడ ఇంజనీరింగ్ ప్రొడక్టులు, మెషీన్లు, ఎక్విప్​మెంట్లు, సేవలను ప్రదర్శిస్తున్నామని చెప్పారు. దాదాపు 20 వేల మంది బిజినెస్​ విజిటర్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు.