
ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇన్ఫినిక్స్ శనివారం భారతదేశంలో జీరో బుక్అల్ట్రా ల్యాప్టాప్ను విడుదల చేసింది. ఇందులో పలు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఫీచర్లు ఉంటాయి. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్లను అమర్చారు. విండోస్ 11 ఓఎస్తో నడుస్తుంది. ఇందులో15.6- అంగుళాల డిస్ప్లే, 16 జీబీ ర్యామ్, టైప్సీ పోర్ట్, 100 వాట్ల చార్జర్, భారీ బ్యాటరీ ఉంటాయి. ధరలు రూ.59,990 నుంచి మొదలవుతాయి. ఫ్లిప్కార్ట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 2,000 తగ్గింపు ఉంటుంది.