న్యూఢిల్లీ: ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ పేసర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. అతని ప్లేస్లో క్రిస్ జోర్డాన్ను ముంబై తమ టీమ్లోకి తీసుకుంది. వేలంలో ఆర్చర్ను ముంబై రూ. 8 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఐదే మ్యాచ్లాడిన అతను రెండు వికెట్లు మాత్రమే తీశాడు. వెన్ను గాయం కారణంగా దాదాపు రెండేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ఆర్చర్ గత ఐపీఎల్కూ దూరంగా ఉన్నాడు.
ప్రస్తుతం కుడి మోచేయి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతని ప్లేస్లో ముంబై టీమ్లోకి వచ్చిన జోర్డాన్ 2016 నుంచి ఐపీఎల్లో 28 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీశాడు. గతంలో ఆర్సీబీ, సన్రైజర్స్, పంజాబ్ కింగ్స్, సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించాడు. గత వేలంలో అమ్ముడవని జోర్డాన్ను ముంబై ఇప్పుడు రూ. 2 కోట్లకు తీసుకుంది.