నిజామాబాద్ జిల్లాలో అంతర్ రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ దొంగల అరెస్టు

నిజామాబాద్ జిల్లాలో అంతర్ రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ దొంగల అరెస్టు
  • 64 ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ చోరీ

నిజామాబాద్​, వెలుగు: పలు ​జిల్లాలో ట్రాన్స్​పార్మర్లలోని కాపర్​వైర్​చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను నిజామాబాద్ ​పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సీపీ పి.సాయిచైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ బైపాస్​వద్ద గురువారం సాయంత్రం వెహికిల్స్​తనిఖీ చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకొని తనిఖీ చేయగా ట్రాన్స్​ఫార్మర్ ​కాపర్ ​కాయిల్స్ దొరికాయన్నారు. 

ఎంక్వైరీ చేయగా బోధన్, మెదక్​కు చెందిన ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో 64  ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్​ను చోరీ చేశారు. చోరీలకు పాల్పడుతున్న మనం సాయిలు, జగన్నాథం సారయ్య, వనం పోశెట్టి, ధనశ్రీ కిరణ్, దాసరి పోచయ్యను అరెస్ట్​చేసినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి వస్తువులను కొనుగోలు చేసిన అక్బర్​హుస్సేన్, షేక్​మహబూబ్​ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి  80 కిలోల రాగి కాయిల్స్, 3 బైక్​లు, 4 మొబైల్స్​స్వాధీనం చేసుకున్నారు.