ఇంటర్ రెండో సారి ఫెయిల్… విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్ రెండో సారి ఫెయిల్… విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండలంలో విషాదం జరిగింది. మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన మట్టా.కార్తిక్(18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  రెండవ సారి ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా ఫెయిల్ కావడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకున్నాడు.

కార్తీక్ హన్మకొండ లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడు. మొదటి సారి ప్రకటించిన ఫలితాల్లో ఒక సబ్జెక్ట్ తప్పిన కార్తీక్.. రెండవ సారి కూడా అదే సబ్జెక్టులో ఫెయిలవడంతో.. దిగులు చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణం తీసున్నాడు. మృతుడు కార్తీక్ తండ్రి బాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.