నాగర్ కర్నూల్లో ఇంటర్ స్టూడెంట్​ ఆత్మహత్య

నాగర్ కర్నూల్లో ఇంటర్ స్టూడెంట్​ ఆత్మహత్య

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తనకు ఇష్టం లేదని చెప్పినా అదే కాలేజీకి వెళ్లి చదువుకోమని ఒత్తిడి చేయడంతో ఇంటర్​ స్టూడెంట్​ సూసైడ్​ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్  మండలం వెంకటాపూర్  గ్రామానికి చెందిన యశ్వంత్​రెడ్డి (17) హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్​ ఫస్ట్  ఇయర్ చదువుతున్నాడు.

ఈనెల 2న వెంకటాపూర్ కు వెళ్లాడు. సోమవారం తిరిగి వెళ్లాలని తండ్రి తిరుపతిరెడ్డి చెప్పడంతో, తాను ఆ కాలేజీలో చదవనని, మరో కాలేజీకి మార్చాలని తండ్రిని కోరాడు. ఈ ఏడాది అదే కాలేజీలో చదవాలని తండ్రి ఒత్తిడి తీసుకొచ్చాడు. అనంతరం పేరెంట్స్​ పొలానికి వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో యశ్వంత్  రెడ్డి పురుగుల మందు తాగి అస్వస్థత గురయ్యాడు.  

గమనించిన చుట్టుపక్కల వారు బాధితుడిని నాగర్ కర్నూల్  జనరల్  ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.