కుషాయిగూడ లో ఇంటర్ స్టూడెంట్​ మిస్సింగ్ ​కేసు

కుషాయిగూడ లో ఇంటర్ స్టూడెంట్​ మిస్సింగ్ ​కేసు

కుషాయిగూడ, వెలుగు: ఇంటర్​ఫెయిల్​అయ్యాననే బాధతో ఓ స్టూడెంట్​ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుషాయిగూడ పరిమళానగర్​లో కర్రపాటి మురళీధర్​కుటుంబంతో ఉంటున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందన మురళీధర్ భార్య చెల్లెలి కొడుకు ఏ. శరత్​బాబు (17)ను తల్లిదండ్రులు ఇక్కడ చదివిస్తున్నారు. గురువారం ఇంటర్​ ఫలితాలు ప్రకటించగా శరత్​ఫెయిల్​అవడంతో మురళీధర్​మందలించాడు. అదే రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారిని, శరత్ ఫ్రెండ్స్​వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియలేదు. వెంటనే కుషాయిగూడ పోలీసులకు కంప్లయింట్​ చేయగా మిస్సింగ్​కేసు ఫైల్​ చేశామని ఎస్ఐ మదన్ లాల్​చెప్పారు.