పెండ్లికి పోయేందుకు  పైసలు ఇవ్వలేదని  ఇంటర్​ స్టూడెంట్​ ఆత్మహత్యాయత్నం

పెండ్లికి పోయేందుకు  పైసలు ఇవ్వలేదని  ఇంటర్​ స్టూడెంట్​ ఆత్మహత్యాయత్నం

భైంసా, వెలుగు :  నిర్మల్​ జిల్లా భైంసాలోని గవర్నమెంట్​ బీసీ కాలేజీ హాస్టల్​లో శనివారం స్టూడెంట్​ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వార్డెన్​ రాజు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...  ముథోల్​ మండలం బ్రహ్మణ్​ గావ్​ గ్రామానికి చెందిన శ్రీకాంత్​ (16)  బీసీ కాలేజీ హాస్టల్​లో ఉంటూ ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ చదువుతున్నాడు. శనివారం తన మిత్రుని ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు వెళ్లేందుకు పేరెంట్స్​కు ఫోన్​ చేసి డబ్బులు కావాలని అడిగాడు. పరీక్షలు  ఉన్నప్పుడు  ఎక్కడికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకోవాలని చెప్పగా..  డబ్బులు కావాలని మారం వేశాడు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని, డబ్బులు కూడా ఇబ్బందిగా ఉందని సముదాయించారు. ఫోన్​ కట్​ అయిన తర్వాత శ్రీకాంత్​ హాస్టల్​ బిల్డింగ్​ పై ఉన్న  స్టోర్​ రూమ్​లో ఉన్న పురుగుల మందు తీసుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు.  గుర్తించిన తోటి స్టూడెంట్స్​, స్థానికులు వెంటనే ఏరియా హాస్పిటల్​కు తరలించి చికిత్సలు అందించారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.