
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎంతవారు గాని'. సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను హీరో అడవి శేష్ విడుదల చేశాడు. టీజర్ బాగుందంటూ యూనిట్కి అభినందనలు తెలిపాడు. కేవలం ఒక నిమిషం నిడివితో ఉన్న ఈ టీజర్ తో మూవీ యూనిట్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది. యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ శ్రీనివాస్ రాంగోపాల్ వర్మ రంగీలా సినిమాకు ఎడిటర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 'క్షణ క్షణం', 'గాయం', 'గోవిందా గోవిందా', 'రాత్రి', 'అంతం', 'ద్రోహి', 'మనీ', 'అనగనగ ఒక రోజు', 'మృగం', 'రాత్', 'మనీ మనీ' సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్ గా పని చేసి అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు 'ఎంతవారుగాని' అనే ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ మూవీకి ప్రవీణ్ K బంగారి సినిమాటోగ్రఫీ అందించగా.. విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.