చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

 చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

చంద్రబాబుకు 52 రోజుల తర్వాత ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో.. స్కిల్ స్కాం కేసులో  రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28 న సరెండర్ కావాలని జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు  వాయిదా వేసింది కోర్టు.  చంద్రబాబు ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 

స్కిల్ స్కాం కేసులో  సెప్టెంబర్ 9 న నంద్యాలలో  చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.  దాదాపు 52 రోజులు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉంటున్నారు. చంద్రబాబు  అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.  ప్రధాన బెయిల్ పిటిషన్ ను నవంబర్ 10న విచారించనుంది హైకోర్టు. 

 చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఆస్పత్రిలో ఉండేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

అసలేంటి స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాం 

 

చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు  2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకుంది . రూ. 3 వేల 356 కోట్ల ఈ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2020లో ఇప్పటి వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 ఫిబ్రవరిలో ఏసీబీ విచారించింది. అనంతరం ఈ కేసు సీఐడీకి బదిలి అయింది.  ఈ అవినీతి కుంభకోణంలో ఏ1గా చంద్రబాబు పేరు, ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా సీఐడీ పేర్కొంది.  చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద  కేసులు నమోదు చేశారు.