మంచిర్యాలలో క్వారీ లేక్ లో మునిగి స్టూడెంట్ మృతి

మంచిర్యాలలో క్వారీ లేక్ లో మునిగి స్టూడెంట్ మృతి
  • మంచిర్యాల శివారులోని ర్యాలీ ఫారెస్ట్ లో ఘటన 

మంచిర్యాల, వెలుగు:  ఫ్రెండ్స్​తో టూర్​కు వెళ్లి న విద్యార్థి క్వారీ లేక్​లో మునిగి చనిపోయాడు. మంచిర్యాలలోని జాఫర్​నగర్​కు చెందిన సాదుల ప్రసాద్​, మంజుల దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు హర్షిత్​(15), టెన్త్​పూర్తి చేయగా.. ఇటీవల హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​కాలేజీలో ఇంటర్​లో జాయిన్ చేశారు.  మంగళవారం ఐదుగురు ఫ్రెండ్స్​తో కలిసి అతడు మంచిర్యాల శివారులోని ర్యాలీ ఫారెస్టుకు వెళ్లాడు.

క్వారీలోని లేక్​లో ఈత కొట్టేందుకు దిగడంతో  హర్షిత్ నీట మునిగాడు. దీంతో మిగతా ఫ్రెండ్స్​భయంతో పారిపోయి ఇంటికి వెళ్లి మౌనంగా ఉండిపోయారు. రాత్రైనా హర్షిత్​జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు అతని ఫ్రెండ్స్​వద్ద వాకబు చేయగా.. జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు తెలిపారు. బుధవారం క్వారీ లేక్​లో గాలింపు చేపట్టగా హర్షిత్​ డెడ్​బాడీ దొరికింది. గురువారం కాలేజీకి వెళ్లాల్సి ఉండగా.. ఇంతలోనే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రసాద్​ ప్రైవేట్​బ్యాంకులో జాబ్ చేస్తుండగా.. మంజుల కోటపల్లి గిరిజన ఆశ్రమ స్కూల్​లో టీచర్​గా చేస్తున్నారు.