
- మంచిర్యాల శివారులోని ర్యాలీ ఫారెస్ట్ లో ఘటన
మంచిర్యాల, వెలుగు: ఫ్రెండ్స్తో టూర్కు వెళ్లి న విద్యార్థి క్వారీ లేక్లో మునిగి చనిపోయాడు. మంచిర్యాలలోని జాఫర్నగర్కు చెందిన సాదుల ప్రసాద్, మంజుల దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు హర్షిత్(15), టెన్త్పూర్తి చేయగా.. ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్కాలేజీలో ఇంటర్లో జాయిన్ చేశారు. మంగళవారం ఐదుగురు ఫ్రెండ్స్తో కలిసి అతడు మంచిర్యాల శివారులోని ర్యాలీ ఫారెస్టుకు వెళ్లాడు.
క్వారీలోని లేక్లో ఈత కొట్టేందుకు దిగడంతో హర్షిత్ నీట మునిగాడు. దీంతో మిగతా ఫ్రెండ్స్భయంతో పారిపోయి ఇంటికి వెళ్లి మౌనంగా ఉండిపోయారు. రాత్రైనా హర్షిత్జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు అతని ఫ్రెండ్స్వద్ద వాకబు చేయగా.. జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు తెలిపారు. బుధవారం క్వారీ లేక్లో గాలింపు చేపట్టగా హర్షిత్ డెడ్బాడీ దొరికింది. గురువారం కాలేజీకి వెళ్లాల్సి ఉండగా.. ఇంతలోనే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రసాద్ ప్రైవేట్బ్యాంకులో జాబ్ చేస్తుండగా.. మంజుల కోటపల్లి గిరిజన ఆశ్రమ స్కూల్లో టీచర్గా చేస్తున్నారు.