ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య యోగా

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య యోగా

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా, మండల కేంద్రాల్లో జరిగిన యోగా డేలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు, యోగ గురువులు, అభ్యాసకులు పాల్గొన్నారు. ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగా చేశారు. పలు కార్యక్రమాల్లో యోగాసనాలు వేయించి, యోగాతో కలిగే ప్రయోజనాలు వివరించారు. వ్యక్తిగత, సామాజిక ఆరోగ్యం, ప్రశాంతతకు యోగా ఉపయోగపడుతుందన్నారు. యోగాతో శారీరక, మానసిక దృఢత్వం ఏర్పడుతుందని,  ప్రతి రోజు అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. యోగా మధుమెహం, రక్త పోటు నివారిస్తుందని తెలిపారు.    

- వెలుగు, నెట్​వర్క్​