ఉత్సాహంగా యోగా డే

ఉత్సాహంగా యోగా డే

గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 9వ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.  రంగారెడ్డి జిల్లా చేగూర్​లోని కన్హా శాంతి వనంలో జరిగిన యోగా దినోత్సవంలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ చీఫ్ గెస్టుగా పాల్గొన్నారు. సుమారు 3 వేల మంది దివ్యాంగులు ఆసనాలు వేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డు,  వండర్ బుక్  ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లోయర్ ట్యాంక్​బండ్​లోని ఎల్ఐసీ ఆఫీసులో జోనల్ ట్రైనింగ్ క్యాంపస్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ – ఆంగన్ యోగా’ థీమ్​తో వేడుకలు నిర్వహించారు. ఎల్ఐసీ సీనియర్ అధికారులు సతీశ్ బాబు, రవికుమార్, రామయ్య, రాజీవ్, మధుసూదన్ పాల్గొన్నారు.  అత్తాపూర్​లోని లక్ష్మీనగర్​లో నిర్వహించిన యోగా వేడుకల్లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

బన్సీలాల్​ పేట మెట్లబావి వద్ద, గాంధీనగర్​లోని సమతాభవన్​లో,సికింద్రాబాద్​లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్​, సిగ్నల్ ఇంజనీరింగ్​ ఆఫీసులో, ఇఫ్లూ వర్సిటీ, ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద, కూకట్​పల్లిలోని పీఎన్ఎం స్కూల్​లో, చర్లపల్లి సెంట్రల్ జైలు, గాంధీ హాస్పిటల్, బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీ, రాజేంద్రనగర్​లోని అగ్రి వర్సిటీ, హిమాయత్​సాగర్​లోని పోలీస్ అకాడమీలో, ఇబ్రహీంపట్నంలోని జ్ఞానసరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్​లో యోగా వేడుకలు నిర్వహించారు.
– వెలుగు,హైదరాబాద్/ ఘట్ కేసర్/ ముషీరాబాద్/సికింద్రాబాద్/పద్మారావునగర్/మూసాపేట/కుషాయిగూడ/శంషాబాద్/గండిపేట/షాద్​నగర్​