- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఆర్మూర్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను నాణ్యతగా, వేగంగా చేపట్టాలని సూచించారు.
అర్హులైన వారికి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, ఆలూర్ తహసీల్ధార్ ఆఫీస్ నిర్మాణానికి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. మంత్రిని ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్ నర్మే నవీన్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆర్మూర్ లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, సొంత స్థలాల్లో బేస్ మెంట్ నిర్మించుకున్న వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపజేయాలని కోరారు. సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, సర్పంచ్ దేవేందర్, తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు.
