బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన మాజీ సీఎం కేసీఆర్తోడల్లుడు జోగినిపల్లి రవీందర్రావు కొడుకు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ బీపీఎల్ కోటా కింద అక్రమ పట్టా పొందాడన్న ఫిర్యాదుపై రెవెన్యూ సిబ్బంది శుక్రవారం విచారణ చేశారు. మానువాడలో నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్టులో కొదురుపాక గ్రామం మునిగిపోయింది.
ప్రభుత్వం వీరికి కొత్తగా ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించింది. ఈ కాలనీలో జోగినిపల్లి సంతోష్ కుమార్ అక్రమంగా పట్టా పొందాడని, అలాగే హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆయన కూతురు సౌమ్య, సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామానికి చెందిన రవీందర్రావు సోదరుడు గండ్ర రమణారావు సైతం ప్యాకేజీ పొందారని మిడ్మానేరు నిర్వాసితుల ఐక్య వేదిక అధ్యక్షుడు, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ ఈ నెల 6న సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
కలెక్టర్ఆదేశాల మేరకు ఈ నెల 29న బోయినిపల్లి ఆర్ఐ విచారణ జరిపారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ముంపు గ్రామాల నిర్వాసితులకు కేటాయించిన ఇండ్ల స్థలాల పట్టా, ప్యాకేజీ వివరాలను పరిశీలించినట్లు సమాచారం.
