- అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారణ
- మాజీ ఎంపీ వినోద్ చెల్లెలికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తం
- ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది
- అలాంటోళ్లందరూ భూమి తిరిగిచ్చేయాలన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందినోళ్లంతా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. నీతి, నిజాయతీగా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలని సూచించారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో పొన్నం చిట్చాట్ చేశారు. గతంలో బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్లంతా బయటకు వెళ్లిపోవాలనిఅన్నారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, విచారణ జరిపించాల్సిందిగా కోరతానని చెప్పారు.
అన్ని శాఖల్లోనూ విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైన నిరుద్యోగులకే ఉద్యోగాలు దక్కాలన్నారు. ‘‘బోయినపల్లి వినోద్కుమార్చెల్లెలికిఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్చెల్లెలు కూడా భూనిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమి తీసుకున్నది. అలాంటి వాళ్లు భూములు తిరిగిచ్చేయాలి” అని సూచించారు. అందరి బాగోతాలనూ బయటపెడతామన్నారు. కరీంనగర్లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలయ్యాయని వస్తున్న విమర్శల నేపథ్యంలో దరఖాస్తుల ఎంట్రీపై జీహెచ్ఎంసీ కమిషనర్రొనాల్డ్రోస్ను మంత్రి వివరణ కోరారు.