సీతారామ కల్యాణ మహోత్సవానికి కేంద్ర మంత్రులకు ఆహ్వానం

సీతారామ కల్యాణ మహోత్సవానికి కేంద్ర మంత్రులకు ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు :  నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) క్యాంపస్ లో చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించే సీతారామ కల్యాణ మహోత్సవానికి  కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ను డీపీఎస్, పీజీఓఎస్ చైర్మన్ మల్కా కొమరయ్య, డీపీఎస్ సీఓఓ మల్కా యశస్వి ఆహ్వానించారు. వీరితో పాటు బీజేపీ సీనియర్ నేతలను గురువారం కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు. 

తొలిసారిగా డీపీఎస్ క్యాంపస్ లో నిర్వహించే వేడుకకు 15వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. వేడుకను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సమాజశ్రేయస్సుకు  కొమరయ్య ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం తదితర ముఖ్యమైన రంగాలపై నిత్యం అంకితభావంతో పనిచేస్తూ  ప్రజలకు ఎనలేని కృషి చేస్తున్నారు.