తిప్పేసిన మిశ్రా.. తక్కువ స్కోరుకే ముంబై కట్టడి

తిప్పేసిన మిశ్రా.. తక్కువ స్కోరుకే ముంబై కట్టడి

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసి 138 పరుగుల తక్కువ టార్గెట్ ను నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్ అమిత్ మిశ్రా 4 వికెట్లతో చెలరేగడంతో ముంబై తక్కువ స్కోరుకే కీలక వికెట్లను చేజార్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది .ఓపెనర్ డికాక్ ఒక పరుగు చేయగానే ఔటయ్యాడు. రోహిత్ శర్మ 44 పరుగులతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 24,ఇషాన్  కిషన్ 26, జయంత్ యాదవ్ 23 మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రాకు 4,అవేశ్ ఖాన్ 2,లలిత్ యాదవ్, స్టోయినస్, రబాడాకు తలో ఒక వికెట్ పడ్డాయి.