దంచి కొట్టిన రస్సెల్.. ఢిల్లీ టార్గెట్ 155

దంచి కొట్టిన రస్సెల్.. ఢిల్లీ టార్గెట్ 155

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ 43, ఆండ్రూ రస్సెల్ 45 మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ,ఆల్ రౌంటర్ సునీల్ నరైన్ డకౌట్ అయ్యారు. రస్సెల్ 4 సిక్సులు రెండు ఫోర్లతో 27 బంతుల్లో 45 పరుగులు చేయడంతో కోల్ కతా డిల్లీ క్యాపిటల్స్ కు155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆఖర్లో రస్సెల్ ఆడటంతోనే కోల్ కతా 154 పరుగులు చేయగల్గింది. ఢిల్లీ బౌలర్లలో  అక్షర్ పటేల్ ,లలిత్ యాదవ్ లకు తలో రెండు, స్టోయినస్, అవేశ ఖాన్ కు చెరో ఒక వికెట్ పడ్డాయి.