చెలరేగిన డికాక్.. రాజస్థాన్ పై ముంబై విక్టరీ

చెలరేగిన డికాక్.. రాజస్థాన్ పై ముంబై విక్టరీ

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ముంబై ఇండియన్స్ ఓపెనర్  రోహిత్(14) శర్మ నిరాశ పరిచినా మరో ఓపెనర్ డికాక్ 50 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులకే ఔటయినా... తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా 26 బంతుల్లో 39 రన్స్ తో చెలరేగాడు. ఆఖర్లో వచ్చిన పోలార్డ్ 8 బంతుల్లో 16 రాణించడంతో మరో 9 బంతులుండగానే ముంబై విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇది మూడో విజయం. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో  క్రిస్ మోరిస్ కు 2,ముస్తఫిజుర్ రహ్మాన్ కు ఒక వికెట్ పడ్డాయి. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.