ఐపీఎల్ 14: ముంబై టార్గెట్ 172

ఐపీఎల్ 14:  ముంబై టార్గెట్ 172

ముంబైతో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్  మంచి ఓపెనింగ్ లభించింది. ఇద్దరు ఓపెనర్లు బట్లర్ 41, జైశ్వాల్ 32 తో రాణించారు. వీరిద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కెప్టెన్ సంజూ సామ్సన్42, శివమ్ దూబె ఇద్దరు కలిసి చెలరేగడంతో ముంబైకి 172 పరుగుల లక్ష్యాన్ని నిరద్దేశించారు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ కు 2, బుమ్రా,  బౌల్ట్ కు చెరో ఒక వికెట్ పడింది. 

మరిన్ని వార్తలు