ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీకి అడ్డుందా!.. ఇవాళ రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌తో పోరు

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీకి అడ్డుందా!.. ఇవాళ రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌తో పోరు


ముంబై: హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ విక్టరీలతో పద్నాలుగో సీజన్‌‌‌‌‌‌‌‌లో అదరగొడుతున్న రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు మరో విజయంపై కన్నేసింది. గురువారం ఇక్కడ జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టనుంది. అటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, ఇటు బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్న కోహ్లీ సేన బలంగా ఉంది. ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌ ముంబైని ఓడించిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ.. తర్వాత సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌, కోల్‌‌‌‌‌‌‌‌కతాపై ఈజీగా విక్టరీలతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. స్టార్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ ఏబీ డివిలియర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు కొత్త టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన గ్లెన్‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో విజృంభించడంతో కోహ్లీసేన ఫుల్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఇద్దరూ భీకర ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బాగానే ఆడిన విరాట్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరుపై కన్నేశాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి తిరుగులేకుండాపోయింది. పేసర్లు సిరాజ్‌‌‌‌‌‌‌‌, హర్షల్‌‌‌‌‌‌‌‌ చాలా పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మరోవైపు రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో రెండింటిలో ఓడి డీలా పడింది. గత పోరులో  చెన్నై చేతిలో చిత్తయిన  ఆ టీమ్​ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని ఓడించి కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌ పెంచుకోవాలని చూస్తోంది. కానీ, అది అంత ఈజీ కాబోదు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీతో చెలరేగిన శాంసన్‌‌‌‌‌‌‌‌ తర్వాతి రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఫెయిలయ్యాడు. జోస్‌‌‌‌‌‌‌‌ బట్లర్‌‌‌‌‌‌‌‌ రాణిస్తున్నా.. సంజు నుంచి అతని సపోర్ట్‌‌‌‌‌‌‌‌ అవసరం.