దంచికొట్టిన ధావ‌న్‌..చెన్నై టార్గెట్-188

దంచికొట్టిన ధావ‌న్‌..చెన్నై టార్గెట్-188

ముంబై : పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్ ఐపీఎల్ సీజన్ 2022లో మరో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌- పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో శిఖ‌ర్ ధావ‌న్‌(88) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో బ్రావో రెండు, తీక్ష‌ణ ఒక వికెట్ సాధించాడు.