ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌‌‌ పోరులో పంజాబ్‌‌‌‌ గెలుపు

ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌‌‌ పోరులో పంజాబ్‌‌‌‌ గెలుపు

ముంబై:  ఐపీఎల్‌‌‌‌15ను సన్ రైజర్స్ హైదరాబాద్‌‌‌‌ ఓటమితో ముగించింది. ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఓడిన రైజర్స్‌‌‌‌ ఎనిమిదో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టింది.  ఆదివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో రైజర్స్‌‌‌‌ను ఓడించి ఆరో ప్లేస్​ సాధించింది. తొలుత  సన్ రైజర్స్ 20 ఓవర్లలో 157/8 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (32 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 43) ఆకట్టుకున్నాడు. చివర్లో సుందర్ (25), షెఫర్డ్ (26 నాటౌట్) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో హర్‌‌‌‌ప్రీత్ (3/26), ఎలిస్‌‌‌‌ (3/40) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్ లో 15.1 ఓవర్లలోనే 160/5 స్కోరు చేసిన పంజాబ్ ఈజీగా గెలిచింది.  లివింగ్‌‌‌‌స్టోన్ (22 బాల్స్ లో 2 ఫోర్లు, 5 సిక్స్ లతో 49 నాటౌట్)తో పాటు ధవన్ (32 బాల్స్ లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 39) రాణించాడు.   ఫరూఖి (2/32) రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.  హర్‌‌‌‌ప్రీత్‌‌‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచాడు. కాగా, మంగళవారం గుజరాత్, రాజస్తాన్ మధ్య కోల్‌‌‌‌కతాలో క్వాలిఫయర్–1 మ్యాచ్ జరుగుతుంది.