
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ సందడి నెలకొంది. మార్చి 31వ తేదీ శుక్రవారం నుంచి ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్–రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.
ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ శనివారం రెండు జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్లకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు చేశారు హెచ్సీఏ ప్రతినిధులు.