ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ సందడి

ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ సందడి

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ సందడి నెలకొంది. మార్చి 31వ తేదీ శుక్రవారం నుంచి ఐపీఎల్ 16 సీజన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం సన్‌ రైజర్స్ హైదరాబాద్‌–రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరగనుంది.

ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ శనివారం రెండు జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు చేశారు హెచ్‌సీఏ ప్రతినిధులు.